న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టికి ఢిల్లీ రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షం కొద్దిసేపటికే తగ్గినా రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. ఉదయాన్నే ఎక్కడికక్కడ రహదారులపై నీళ్లు నిలువడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని ధౌలా కువాన్ ఏరియాలో, సుప్రీంకోర్టు పరిసరాల్లో, భైరాన్ టెంపుల్ ప్రాంతంలో రోడ్లపై వరద నీరు నిలిచిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.