ముంబై: రిజర్వు బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి (68) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. కమర్షియల్ బ్యాంక్లో తన కెరీర్ ఆరంభించిన చక్రవర్తి.. అంచెలంచెలుగా ఎదుగుతూ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ స్థాయికి చేరారు. శుక్రవారం ఉదయం ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించినట్లు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులైన బీవోబీ, ఇండియన్, పీఎన్బీల్లో పనిచేసిన ఆయన.. 2009లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా చేరారు. 2014లో మూడు నెలల ముందుగానే చక్రవర్తి తన పదవికి రాజీనామాచేశారు.