న్యూఢిల్లీ, మార్చి 25: అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తొలిగిస్తున్న చెట్ల వాస్తవ విలువను అంచనా వేయడానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు సుప్రీం కోర్టు సమాయత్తమైంది. దీనిలో భాగంగా ఏడుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో చెట్లను తొలిగించాల్సి వచ్చినప్పుడు న్యాయంగా ఎంత నష్ట పరిహారం చెల్లించాలనే ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతుంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.