కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 2: సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, లక్ష్యసాధనకు మరో నెలలు మాత్రమే సమయం ఉందని సంస్థ సీఎండీ శ్రీధర్ అన్నారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు రోజుకు కనీసం 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
వానకాలంలో వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తిలో కాస్త వెనుకబడ్డామన్నారు. ఒక్కో అవాంతరాన్ని ఎదుర్కొని ఉత్పత్తిలో ముందుకు సాగుతున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో లక్ష్యాన్ని సాధించాలన్నారు. అన్ని ఓపెన్కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ వెలికితీత పనుల బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించామన్నారు. ఒక్కో ఏజెన్సీ రోజుకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాల్సి ఉందన్నారు. సమావేశంలో డైరెక్టర్స్ చ్రందశేఖర్, బలరాం, సత్యనారాయణరావు, అడ్వైజర్ డీఎన్ ప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఆల్విన్ పాల్గొన్నారు.