నూతన వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు అన్యాయం
రైతులకు అండ కేసీఆర్ మాత్రమే: ఆర్.నారాయణమూర్తి
సత్తుపల్లి/ అశ్వారావుపేట/ కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 14: నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఒక పక్క తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలను ఆదుకుంటుంటే.. మరో పక్క మోడీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. సత్తుల్లిలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో, అశ్వారావుపేటలోని సీపీఎం కార్యాలయంలో, కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో గురువారం వేర్వేరుగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కర్షకులకు 24 గంటల ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడి కోసం రైతుబంధు అందిస్తోందని గుర్తుచేశారు. అన్నదాతలకు ఉండగా ఉన్నది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. సమాజాన్ని చైతన్యం చేసే రైతన్న లాంటి సినిమాలను ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, సాబీర్పాషా పాల్గొన్నారు.