ఇల్లెందు, జనవరి 11: ఇల్లెందు మున్సిపాలిటీని రోల్మోడల్గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే హరిప్రియకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో ప్రగతిభవన్లో మంగళవారం మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యే హరిప్రియ కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పట్టణాభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ.15 కోట్లు మంజూరు చేశారన్నారు. బుగ్గవాగు ప్రక్షాళనకు రూ.5 కోట్లు, ట్యాంక్బండ్ సుందరీకరణకు రూ.1.50 కోట్లు, పట్టణ ప్రధాన కూడళ్ల సుందరీకరణకు రూ.120 కోట్లు, ఆడిటోరియం నిర్మాణానికి రూ.2.50 కోట్లు, డీఎంఎఫ్టీ నిధుల నుంచి ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు ఇవ్వాలని, జనవరి నెలాఖరులోపు వాటిని మంజూరు చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ను మంత్రి ఆదేశించినట్లు వివరించారు. దీంతో నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ నవీన్కుమార్, టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు మెరుగు కార్తీక్ తదితరులు ఉన్నారు.