డిసెంబర్ 16 తర్వాత ప్రతి గ్రామం నుంచి భారీగా చేరికలు
టీఆర్ఎస్ చేరికల సభలో ఖమ్మం జడ్పీ చైర్మన్ కమల్రాజు
ముదిగొండ నవంబర్ 10: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, అభివృద్ధిని చూసి ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతన్నారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండలంలోని బాణాపురంలో వివిధ పార్టీల నుంచి 200 మంది బుధవారం టీఆర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కమల్రాజు మాట్లాడారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా పరిమితంగానే కార్యక్రమం ఏర్పాటు చేశామని, డిసెంబర్ 16 తర్వాత కోడ్ ముగిశాక ప్రతి గ్రామంలోనూ చేరికలు పెద్దఎత్తున ఉంటాయని అన్నారు. ఈ చేరికలను చూసి కాంగ్రెస్కు కళ్లు మండుతున్నాయని, అందుకే ఫిర్యాదులు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ గోడలు కట్టినా వాటిని బద్దలు కొట్టి మరీ ప్రజలు వచ్చి తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆలోచించే నాయకులనే ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే సీఎం కేసీఆర్కు మద్దతు ఇస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెకంటి, సామినేని హరిప్రసాద్, పసుపులేటి దుర్గ, పీటీ కిశోర్, పోట్ల ప్రసాద్, బండ్ల వాసు, తోట ధర్మారావు, కాజా, బత్తుల వీరారెడ్డి, ఎర్ర వెంకన్న, బంక మల్లయ్య, సామినేని వెంటేశ్వరరావు, మేముల శ్రీనివాసరావు, సింగు రాజయ్య, భిక్షం పాల్గొన్నారు.