నియోజకవర్గ అభివృద్ధికి రూ.1000కోట్ల నిధులు
ప్రతి పేదోడి గుండె చప్పుడులో తెలంగాణ ప్రభుత్వం
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బూర్గంపహాడ్, ఏప్రిల్ 9 : ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండలంలో పర్యటించిన ఆయన తొలుత నకిరిపేట, టేకులచెరువు గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం అంజనాపురం, మోరంపల్లిబంజర గ్రామాల్లో సీసీ రోడ్లతో పాటు హెల్త్ సబ్సెంటర్, రైతువేదికలను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అన్నదాతల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా రైతువేదికలను ఏర్పాటు చేశామని, రైతులకు రైతువేదికలు పరిష్కార కేంద్రాలకు మారాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన తన జన్మదిన వేడుకల్లో పాల్గొని రేగా కేక్ను కట్చేసి నాయకులు, కార్యకర్తలకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, సర్పంచ్లు సర్పా వెంకటేశ్వర్లు, భూక్యా సుజాత, భూక్యా దివ్యశ్రీ, సిరిపురం స్వప్న, తుపాకుల రామలక్ష్మి, భూక్యా భారతి, ఏవో అనిల్కుమార్, పీఆర్ ఏఈ వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, గోనెల నాని, వల్లూరిపల్లి వంశీకృష్ణ, కొనకంచి శ్రీను, జక్కం సర్వేశ్వరరావు, బొల్లు సాంబశివరావు, సిరిపురం ప్రసాద్, యక్కంటి శ్రీనివాసరెడ్డి, తోటమళ్ల సరిత, పేరం రామకొండారెడ్డి, అన్నిపంచాయతీల గ్రామకమిటీ అధ్యక్షులు, రైతుసమన్వయ సమితి గ్రామకమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.