భద్రాచలం, ఆగస్టు 4: భద్రాచలంలోని రామాలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని కోరుతూ బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు బండ్ల ప్రకాశ్, రంజిత్రెడ్డి, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, వెంకటేశ్ బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. రామాలయానికి నిత్యం వేలాది మంది వస్తుంటారని, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆలయానికి వీలైనంత మేలు చేయాలన్నారు.