భద్రాద్రి జిల్లాలో సంబురంగా బతుకమ్మ చీరెల పంపిణీ
లక్ష్మీదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
కొత్తగూడెం, అక్టోబర్ 3: పూలపండుగ బతుకమ్మకు సర్కారు కానుకగా చీరెను ఇవ్వడంతో ఆడబిడ్డలందరూ వాటిని కట్టి సందడి చేశారు. భద్రాద్రి జిల్లాలో బతుకమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమం ఆదివారమూ కొనసాగింది. లక్ష్మీదేవిపల్లి సంజయ్నగర్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చీరెలు పంపిణీ చేయగా ఆడబిడ్డలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. రంగురంగుల చీరెలు తీసుకున్న మహిళలు వాటిని చూసి సంబురపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులు బతుకమ్మ చీరెలను కట్టుకొని సందడి చేశారు.
సీఎం, ఎమ్మెల్యే ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం
బతుకమ్మ చీరెలు అందుకున్న సందర్భంగా లక్ష్మీదేవిపల్లిలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే వనమా ఫ్లెక్సీలకు మహిళా ప్రజాప్రతినిధులు, స్థానిక మహిళలు కలిసి క్షీరాభిషేకం చేశారు. ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షురాలు కొల్లు పద్మ, సర్పంచ్లు తాటి పద్మ, భూక్యా పద్మ, ఎంపీటీసీ భద్రమ్మ, అంగన్వాడీ టీచర్లు పద్మ, పుష్ప, మహిళా సంఘం సభ్యులు రమణ, కోఆప్షన్ సభ్యులు సుందర్, ఆత్మకమిటీ డైరెక్టర్ వినోద్, బావ్సింగ్, నాయకులు పాల్గొన్నారు.