కూసుమంచి, జూన్ 18: ప్రజారోగ్య సంరక్షణే రాష్ట్ర సర్కార్ ధ్యేయమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జీళ్లచెరువులోని మిషన్ భగీరథ నీటిశుద్ధి ప్రాజెక్ట్లో పథకం సీఈ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ‘మంచినీళ్ల పండుగ’లో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ శుద్ధజలం అందుతున్నదని, తద్వారా వారి ప్రజారోగ్య సంరక్షణ సాధ్యమైందన్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ విజన్తో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నదన్నారు.
అధికారులు కొత్తగా ఏర్పడిన గ్రామంలో నీటి కనెక్షన్లు ఇవ్వాలన్నారు. మిషన్ భగీరథ పైప్లైన్స్ వేసేటప్పుడు సీసీ రోడ్ల పాడవకుండా చూడాలని సూచించారు. జీళ్లచెర్వు నీటి శుద్ధి కేంద్రానికి విద్యార్థులు విహారయాత్రకు వచ్చేలా చూస్తామన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. నాడు ప్రజల తాగునీటి కష్టాలను కళ్లారా చూసి ఉద్యమ నేత కేసీఆర్ స్వరాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రిగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ శుద్ధజలం అందుతున్నదన్నారు. కేసీఆర్ తనదైన విజన్తో రాష్ర్టాన్ని సిరుల తెలంగాణగా మార్చారన్నారు.
రాష్ట్రంలో తాగు, నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 95శాతం మంచి పనులు చేస్తున్నా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ వంటి పథకంలో దేశంలో మరెక్కడా లేదన్నారు. పథకంలో భాగంగా 558 ట్యాంక్లు నిర్మించామన్నారు. పొరుగు రాష్ర్టాల ప్రజలు ఇప్పటికీ వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారన్నారు. జలాలను గుట్టలు ఎక్కించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గురుత్వాకర్షణ ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 1.88 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామన్నారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకంలో భాగంగా రైతువేదికలు, వైకుంఠధామాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకూ శుద్ధజలం అందిస్తున్నామన్నారు. అనంతరం పలు పంచాయతీల సర్పంచ్లను అతిథులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్, బెల్లం ఉమ, బోడా మంగీలాల్, సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ వరప్రసాద్,