మంథని రూరల్, డిసెంబర్ 25: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మండలంలో గోపాల్ పూర్ లో మేడ రామయ్య, రాజు స్మారకార్థం విశ్రాంత ఉద్యోగి మేడ రాజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను జడ్పీ చైర్మన్ ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా క్రీడాకారులకు టీషర్టులు అందజేశారు. ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ పాల్గొన్నారు.
ముత్తారం,డిసెంబర్25: మండలంలోని ఓడేడ్లో గాజుల కనకయ్య, అక్కపాక సారమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబాలను పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజవర్గ ఇన్చార్జి పుట్ట మధు ఆదివారం పరామర్శించారు. మృతుల చిత్ర పటాలపై పూలు చల్లి నివాళులర్పించారు. వారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుకున్నారు. ఎంపీపీ జక్కుల ముత్తయ్య, పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ సూదాటి రవీందర్రావు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నూనె కుమార్, బీఆర్ఎస్ మంథని మండల అధ్యక్షుడు ఎగోలపు శంకర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గట్టు రమేశ్, డాక్టర్ స్వామి ఉన్నారు.