మంథని, సెప్టెంబర్24: ‘బుద్ధం శరణం గచ్చామి. బౌద్ధ బోధనలతో అంబేదర్ ఆశయాలను కొనసాగిస్తాం. అంబేదర్ అసలైన వారసుడు సీఎం కేసీఆర్. ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం దశదిశలా అభివృద్ధి చెందుతున్నది’ అని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఉద్ఘాటించారు. ఆదివారం మంథని పట్టణం స్థానిక అంబేదర్ నగర్ అంబేదర్ చెరువులో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేదర్ విగ్రహాలను మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, బౌద్ధ మునిలతో కలిసి ఆయన ఆవిషరించారు. అలాగే, బొకల వాగు పైన గడిపెల్లి రాములు కుటుంబ సభ్యుల సమక్షంలో గడిపెల్లి రాములు విగ్రహాన్ని ఆవిషరించారు. ఆయాచోట్ల జడ్పీ చైర్మన్ మాట్లాడారు. గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలతో, అంబేదర్ చూపించిన రాజ్యాంగ విలువలతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ఇది జరగాలంటే ప్రతి ఒకరూ ఓటు హకు ప్రాధాన్యత తెలుసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చేసే నాయకుల పైన చర్చ కూడా జరగాలని సూచించారు. అనంతరం బౌద్ధమునులను జడ్పీ చైర్మన్ మధూకర్ దంపతులు సన్మానించారు.
గడిపెల్లి రాములు సేవలు మరువలేనివి
హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, మంథని వాసి గడిపల్లి రాములు చేసిన సేవలు మరువలేనివని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కొనియాడారు. పీవీ నరసింహారావుకు ఆత్మీయుడిగా మెలిగిన గడిపెల్లి రాములు పరిపాలనలో నిరంతరం ప్రజాసేవకు అంకితమై పని చేశారని, అతని క్రమశిక్షణ అతని కుటుంబ సభ్యుల్లో చూస్తున్నామని, గడిపెల్లి రాములు ఆశయాలను కొనసాగిస్తామన్నారు. గడిపెల్లి రాములు తనయుడు రిటైర్డ్ డీఎస్పీ గడిపల్లి రవీందర్ మాట్లాడుతూ తన నాన్న విగ్రహాన్ని మంథనిలో ఏర్పాటు చేసిన పుట్ట మధూకర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఆయా కార్యక్రమంలో మంథని ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ , మండల పార్టీ అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్, నాయకులు తగరం శంకర్ లాల్, వేల్పుల గట్టయ్య, ఆకుల కిరణ్, గడిపెల్లి రాములు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.