కార్పొరేషన్, నవంబర్ 5: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన, డివిజన్లకు చెందిన యువకులు, మహిళలు ఆదివారం స్థానిక మంత్రి నివాసంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో పార్టీలో చేరారు.
వారికి మంత్రి గంగుల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నాయకుడు నక్క కృష్ణ ఆధ్వర్యంలో నగరంలోని పలువురు యువకులు, కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, మొగ్దుంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకుడు మంథని కిరణ్ ఆధ్వర్యంలో పలువురు మహిళలు మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒకరూ కృషి చేయాలని కోరారు. ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ రూరల్ మండలాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, కాసారపు శ్రీనివాస్గౌడ్, అంజిరెడ్డి, గంగాధర లక్ష్మయ్య, గంగాధర చందు, వొల్లాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.