సిరిసిల్ల రూరల్/గంభీరావుపేట, మార్చి 8: తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పడిగెల మానస నివాసంలో బీఆర్ఎస్ మహి ళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్స వాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ ఏఎంసీ మాజీ చైర్పర్సన్ పూసపల్లి సరస్వతి, మాజీ సర్పంచ్ కోడం సంధ్యారాణి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సద్ద రోజా, తదితరులు ఉన్నారు.
గంభీరావుపేట గోరంటాల లో మహిళా ప్రజాప్ర తినిధులు, ఆయా శాఖ ల ఉద్యోగులను జడ్పీ టీసీ కొమిరిశెట్టి విజయ సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా అభివృద్ది చెం దాలని జడ్పీటీసీ సూచించారు. కార్యక్రమం లో ఎంపీటీసీ సభ్యుడు ఎర్రం అంజిరెడ్డి, మాజీ సర్పంచులు కొలుముల అంజమ్మ, ఎర్రం లతిక, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సీఏలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.