మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారంలో పెద్దమ్మ బోనాల వేడుకలకు హాజరు
ధర్మారం, జూన్ 27: స్వరాష్ట్రంలోనే మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వారి అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్నారని చెప్పారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేపలు పట్టుకొనేందుకు హక్కులు కల్పించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కిందని చెప్పారు. సోమవారం ఆయన ధర్మారంలో పెద్దమ్మతల్లి బోనాలు, పట్నాల ఉత్సవాలకు హా జరయ్యారు. పెద్దమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ముదిరాజ్ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడారు. తెలంగాణ సిద్ధించకముందు ముదిరాజ్లు అనేక అష్టకష్టాలు పడ్డారన్నారు. రాష్ట్రం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఆర్థిక భరోసానిచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ దిశగా ఉచితంగా చేప పిల్లలు, వాహనాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పుష్కలంగా చేపల పెంపకంతో రాష్ట్రం ఫిష్హబ్గా అవతరించిందని చెప్పారు.
కార్య క్రమంలో సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల లత, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రేగుల లక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గాజుల రాజు, నాడెం శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు బాస తిరుపతి రావు, పట్టణ మహిళా అధ్యక్షు రాలు దేవి లావణ్య, నాయకులు మంద శ్రీనివాస్, దేవి నళినీకాంత్, దేవి వంశీకృష్ణ, రేగుల జితేందర్, సల్వాజీ మాధవరావు, బండవరం సుమన్, నూనె రవి తదితరులు పాల్గొన్నారు.