ఎల్లారెడ్డిపేట, మే 1 : విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. అం దుకు తన జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పా రు. తన చిన్నాన్న ప్రోత్సాహంతో ముందుకు సాగానని, ఒక పూట భోజనం చేయకున్నా చదువును మాత్రం కొనసాగించానని చెప్పారు. యూనివర్సీటీలో ఫస్ట్ ర్యాంకు కోసం చదివిన చదివే తాను ఐఏఎస్ సాధించేందుకు కారణమైందని పేర్కొన్నారు. ఈ హోదాతో ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే అవకాశం లభించిందన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో ఇంగ్లిష్ టీచర్ లింగాల రాజు ఆధ్వర్యంలో సోమవారం చదువుల పండుగ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రమణాచారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేదిక కింద కూర్చున్న విద్యార్థులు వేదికపై మాట్లాడే అవకాశం రావాలంటే కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ‘విద్య ద్వారా వినయం, వినయం ద్వారా పాత్ర, పాత్ర ద్వారా ధనం, ధనం ద్వారా ధర్మం వస్తుందని ధనం, ధర్మం రెండూ ఉంటే సుఖం వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
గ్రామానికి చెందిన డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఐఏఎస్, సెంట్రల్ సర్వీసెస్కు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రతిఒక్కరూ కంకణబద్ధులపై పనిచేసినప్పుడే నారాయణపూర్కు రాష్ట్రస్థాయి అవార్డు వస్తుందని చెప్పారు. ప్రభుత్వ స్కూల్లో చదివి మంచి మార్కులు సాధించినవారికి ప్రోత్సాహకం అందిస్తామని ఆయన ప్రకటించారు. కన్వీనర్ లింగాల రాజు మాట్లాడు తూ, గ్రామంలోని విద్యావంతుల సహకారంతో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడ డీఈవో రమేశ్కుమర్, కేంద్ర సా హిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్క ర్, ఎంపీడీవో చిరంజీవి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్, సర్పంచ్ నిమ్మ లక్ష్మి, ఎంపీటీసీ అపేరా సుల్తానా, ఉప సర్పంచ్ మహేందర్, బీఆర్ఎస్ నేత నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సయ్య, టీచర్ మనోహర్, రిటైర్డ్ టీచర్లు వెంకటయ్య, దేవిరెడ్డి పాల్గొన్నారు.