జగిత్యాల : రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాలు ( Congress Goons ) అధికార మదంతో చేసిన దాడిని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ( Dava Vasanta ) తీవ్రంగా ఖండించారు.ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అరాచక పాలన అంతు చూస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా రౌడీల రాజ్యంగా మార్చేశారని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ను ఎవరూ చెదిపేయలేరని అన్నారు. పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి కాంగ్రెస్కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు.
దాడులకు పాల్పడుతున్న మూకలను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. చిల్లర దాడులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ అని, కేసీఆర్ సైనికులుగా ప్రజల పక్షాన సమస్యల పట్ల పోరాడుతామని వెల్లడించారు. ఈ సమావేశంలో జగిత్యాల రూరల్, అర్బన్ మండల అధ్యక్షులు అయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, పాక్స్ మాజీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కమలాకర్ రావు, ఎల్లా రాజన్న, హరీష్, తదితరులు పాల్గొన్నారు.