Indiramma houses | కాల్వశ్రీరాంపూర్, జూలై 12 : అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట, కూనవరం, గంగారం, పందిళ్ళ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేసి ముగ్గులు పోశారు.
వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పూర్ణచందర్రావు, ఏవో నాగార్జున, ఏపీఓ మంజుల, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ సర్పంచులు దొనికెన మొగిలి, దేవేందర్ రావు, సాధన వేణ కొమురయ్య, తులా మనోహర్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.