జగిత్యాల, ఫిబ్రవరి 9 : జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుంచామని, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టామన్నారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వ స్పందన లభించిందని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన హామీలను విస్మరించాయని, గులాబీ సైనికులకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల అభివృద్ధిపై వైరల్ అవుతున్న వీడియోలు బీఆర్ఎస్ హయాంలో చేసినవేనని, రెండేళ్లలో అకడకడా సీసీ రోడ్లు తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రశ్నించే గొంతుకలకు ఓటేయబోతున్నారని తెలిపారు. మెడికల్, నర్సింగ్ కళాశాల, మాతా శిశు కేంద్రం, చింతకుంట చెరువు అభివృద్ధి ఘనత బీఆర్ఎస్దేనన్నారు. 4520 డబుల్ బెడ్రూం ఇండ్లు కేసీఆర్ ఇచ్చినవేనని గుర్తు చేశారు.
అంతా మంచే జరగాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దావ సురేశ్, ఎల్ కార్తికేయ, పట్టణాధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, శీలం ప్రవీణ్, ఆసీఫ్, అనంతుల గంగారెడ్డి, పడిగెల గంగారెడ్డి, ఎండబెట్ల ప్రసాద్, వొళ్ళాల గంగాధర్, వనమాల నిరంజన్, కుడిక్యాల సర్వేశ్వర్, అజ్ఘర్ ఖాన్, వసీం, గంగిపెల్లి శేఖర్ పాల్గొన్నారు.