Anna Prasadam distribution | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 27: అయ్యప్ప మాలధారణ స్వాములు నిత్య అన్న ప్రసాద వితరణను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపెల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల రోడ్లో గల అయ్యప్ప ఆలయంలో ఈనెల 27 గురువారం నుంచి 45 రోజులపాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి తెలిపారు. నిత్య అన్న ప్రసాద వితరణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ హాజరై సుల్తానాబాద్ ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు డాక్టర్ ఆయిల రమేష్, రైస్ మిల్లుల సంఘం జిల్లా అధ్యక్షుడు నగునూరి అశోక్ కుమార్, సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ పల్ల మురళి, ఆర్యవైశ్య సంఘం సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షుడు కొమురవెల్లి భాస్కర్, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ డైరెక్టర్ సామల యమున-హరికృష్ణ, టీకే ప్రభాకర్, మాడూరి ప్రసాద్, పన్నాల రాములు, అభినవ్, అయ్యప్ప మాలధారణ స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.