ధర్మారం, నవంబర్ 30 : ధర్మారం మండలం నంది రిజర్వాయర్ నుంచి లింక్ కాల్వ తవ్వకం చేపట్టి ఎస్సారెస్పీ డి 83/బి కాల్వకు అనుసంధానం చేయడంతో కాళేశ్వర జలాలు అంది త్వరలో వెల్గటూరు మండలంలోని కాల్వ చివరి గ్రామాల రైతుల చిరకాల ఆకాంక్ష నెరవేరనున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు నంది రిజర్వాయర్ నుంచి రూ. 12.40 కోట్లతో నిర్మించే కొత్త కాల్వ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సారెస్పీ డీ83/బీ కాల్వ చివరి ప్రాంతాలైన వెల్గటూరు మండలంలోని మొక్కట్రావుపేట, రాంనూరు, ముత్తునూరు, చెగ్గాం గ్రామాలకు చెందిన రైతులు కాల్వ నీరందక అవస్థలు పడ్డారని అన్నారు.
ఈ క్రమంలో అక్కడి అన్నదాతలకు శాశ్వతంగా సాగు నీరందించేందుకు ఐదేళ్ల క్రితమే నంది రిజర్వాయర్ నుంచి ఎడమ వైపు లింక్ కాల్వ నిర్మించాలని సంకల్పించి అధికారులతో అంచనాలు వేయించి ప్రభుత్వానికి పంపించి రూ. 12.40 కోట్లు మంజూరు చేయించామని ఆయన గుర్తు చేశారు. ఈ నిధుల్లో రూ. 4.76 కోట్లతో భూ సేకరణ చేపట్టగా , మిగతా రూ. 7.64 కోట్లతో కొత్తగా లింక్ కాల్వ నిర్మాణం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కాల్వ నిర్మాణం పూర్తయితే సాగు నీరంది కాల్వ చివరన ఉన్న 12 గ్రామాల్లోని ఎస్సారెస్పీ కాల్వ కింద భూములు స్థిరీకరణ అవుతాయని మంత్రి ఈశ్వర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామంతుల జానకి -శంకర్, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపీటీసీలు కట్ట సరోజ- స్వామి, మిట్ట తిరుపతి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఏఎంసీ, విండో వైస్ చైర్మన్లు చొప్పరి చంద్రయ్య, సామంతుల రాజమల్లు,ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు పూస్కూరు రామారావు, జడ్పీ, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి సలామొద్దిన్, ఎండి రఫి, టీ(బీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్,ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, డైరెక్టర్ సందినేని కొమురయ్య, ఉప సర్పంచ్ కట్ట రమేశ్, వార్డు సభ్యులు, నంది మేడారం గ్రామ ప్రముఖుడు పో నుగోటి నర్సింగారావు, గ్రామ నాయకులు బొడ్డు రాములు, బోయినపల్లి గంగారాం, ఆవుల రాజ య్య, ఎస్పారెస్పీ ఎస్ఈ ఎ.సత్యరాజ చంద్ర, ఈఈ జీ ప్రసాద్, డీఈఈ వై.కుమార్, ఏఈఈ కే నరేశ్, పనుల కంట్రాక్ట్ ఎస్ఆర్ఆర్సీ సంస్థ ప్రా జెక్ట్ మేనేజర్ సతీశ్, సంస్థ ఇంజినీర్ సంగప్ప, స ర్పంచులు,ఎంపీటీసీలు,రైతులు పాల్గొన్నారు.