మల్యాల/కొడిమ్యాల/జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 15 : “ఒక రైతుగా.. రైతు బిడ్డగా అలుపెరుగని కృషితో వ్యవసాయాన్ని పండుగలా మార్చిండు. సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ను ఇచ్చి వెలుగులు నింపిండు. తొలకరికి ముందే పెట్టుబడికి సాయం.. ఇంటిపెద్ద పోతే కుటుంబం రోడ్డున పడకుండా రూ.5లక్షల బీమా ఇస్తున్నడు. ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మితో పేదింటికి పెద్దకొడుకయిండు. మిషన్ కాకతీయతో చెరువులను బలోపేతం చేసి సబ్బండవర్గాలకు బతుకునిచ్చిండు. మిషన్భగీరథతో ఇంటింటికీ శుద్ధజలం అందించి ఆరోగ్యరక్షగా నిలిచిండు. చారిత్రక దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చి దశాబ్దాలుగా చీకట్లో మగ్గిన దళితులకు బతుకుచూపిండు. ఇలాంటి విప్లవాత్మక పథకాలతో ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశమే బాగుపడుతుంది. తెలంగాణ మాదిరి ప్రతి పథకం దేశవ్యాప్తంగా అమలై పురోగమిస్తుంది’ అని జడ్పీటీసీలు స్పష్టం చేస్తున్నారు. బీజేపీతో దేశానికి పట్టిన శని కేసీఆర్తోనే దూరమవుతుందని, ప్రజలందరికీ మేలవుతుందని చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు
దేశానికి ఏదైనా చేయాలన్న తపన ఉన్నది. పేదలకు మేలు చేయాలన్న సంకల్పం ఉన్నది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని నేను పద్మశాలీ బిడ్డగా.. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జడ్పీటీసీగా స్వాగతిస్తున్న. ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి నేత కార్మికుల గోసను, వారి ఆత్మహత్యలను చూసి చలించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నేత కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నరు. బతుకమ్మ చీరెలతో బతుకుదెరువు చూపుతున్నరు. 50 ఏండ్ల్లు దాటిన తర్వాతి నుంచే పింఛన్ ఇస్తున్నరు. ‘నేతన్నకు బీమా’ భరోసా ఇస్తున్నరు. నేతన్నకు త్రిప్ట్, యారన్ సబ్సిడీ, మర మగ్గాల ఆధునీకరణ పథకం, రూ. లక్ష లోపు రుణమాఫీ ఇలా ఎన్నో అమలు చేస్తున్నరు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో జాతీయ జెండాల తయారీతో అదనపు ఉపాధి కల్పించిన్రు. ఒక్క నేత కార్మికులనే కాదు తెలంగాణలో అన్ని వర్గాలకూ ప్రోత్సాహం అందిస్తున్నరు. కులవృత్తులకు జీవం పోస్తున్నరు. ఇలాంటి తపన ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని వర్గాలకూ ప్రయోజనం చేకూరుతుంది. దేశం అభివృద్ధి బాటన పయనిస్తుంది.
– బొద్దుల లక్ష్మణ్, జూలపల్లి జడ్పీటీసీ, పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
వ్యవసాయ రంగ అభివృద్ధి
కర్షకుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్. అందుకే ఆయన పెట్టుబడికి ఇబ్బందులు ఉండకుండా సీజన్కు ముందే రైతుబంధు కింద సాయం అందిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఊరిలోనే మద్దతు ధరతో కొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేశారు. మరోవైపు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ధాన్యం కొనేందుకు కేంద్రం కొర్రీలు పెట్టినా.. సీఎం కేసీఆరే ధాన్యం కొనుగోలు చేశారు. రైతును రాజుగా మార్చేందుకు కేసీఆర్ కృషి చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వారు మాత్రం కార్పొరేట్లకు అనుకూలంగా నల్ల చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో రైతు సంఘాలను సంఘటితం చేసి ఇతర రాష్ర్టాల రైతులకు సైతం అండగా ఉంటూ నల్ల చట్టాలను తాత్కాలికంగా వెనక్కి తీసుకునేదాకా పోరాడారు. ఆ ఉద్యమంలో అమరులైన ఇతర రాష్ర్టాల రైతు కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేశారు. ఉద్యమ నాయకుడిగా అపార అనుభవం కలిగిన కేసీఆర్ జాతీయస్థాయి రాజకీయాల్లో క్రీయశీలకంగా వ్యవహరిస్తేనే దేశమంతటా వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుంది. రైతులు ఆర్థికాభివృద్ధి సాధించి వారి జీవనశైలిలో మరింత మార్పులు చెందే అవకాశం ఉంది.
– కొండపలుకుల రాంమోహన్రావు, జడ్పీటీసీ (మల్యాల)
కేసీఆర్ పీఎం అయితేనే దేశం నంబర్వన్
అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రజల మద్దతుతో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో అనేక అద్భుతాలు సృష్టించారు. మహిళలకు రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన గొప్ప నాయకుడు. దేశంలో చివరగా ఏర్పడ్డ రాష్ర్టాన్ని అన్నింటా అగ్రగామిగా నిలిపిండు. ఆయన దీక్షా దక్షతోనే ఈ ఘనత సాధ్యమైంది. బంగారు తెలంగాణ నిర్మాణానికి కంకణబద్ధుడై ముందుకెళ్తున్నడు. ప్రజల అవసరాలను గుర్తించి ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ ముందుకుసాగుతున్నడు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నడు. అశోకుడి తరహాలోనే చెట్లు నాటించిండు. చెరువులను తవ్వించిండు. ఆయన్ను స్మరించుకున్నట్లే తెలంగాణ ప్రజానీకం సైతం కేసీఆర్ను గుర్తుపెట్టుకుంటది. బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో దేశం భ్రష్టు పట్టింది. అనేక రంగాల్లో అథోగతి పాలైంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ లాంటి నాయకుడు ప్రధాని అయితే భారతదేశం ప్రపంచంలోనే నంబర్వన్గా నిలుస్తుంది.
– తగరం సుమలత, జడ్పీటీసీ (మంథని)
ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తుంది..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లితే దేశం అభివృద్ధి దూసుకెళ్తుంది. తెలంగాణ ఏ విధంగా అయితే అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా మారిందో అలా దేశమూ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తుంది. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలోనే అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దే. తీరొక్క పథకాల అమలుతో ప్రజలంతా సంతోషంగా ఉన్నరు. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగుకు సమృద్ధిగా నీరందిస్తూ.. ఉచిత కరెంట్, రైతు బంధు పథకాలతోపాటు అనేక ప్రోత్సాహాలతో వ్యవసాయం పండుగలా మారింది. రాష్ట్ర సంపదంతా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకే పంచుతున్నడు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయడంలేదు. అన్ని సక్రమంగా జరగాలన్నా.. పేదల అభ్యున్నతి జరగాలన్నా దేశం బలమైన, స్థిరమైన నాయకుడి చేతిలో ఉండాలి. అందుకు సీఎం కేసీఆరే సమర్థవంతమైన నాయకుడు. ఆయన దేశ రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది.
– కత్తెరపాక ఉమా కొండయ్య, జడ్పీటీసీ (బోయినపల్లి)
కేసీఆరే దేశానికి శ్రీరామరక్ష
సీఎం కేసీఆర్ లాంటి పాలనదక్షుడు జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశానికి శ్రీరామరక్ష. రాష్ట్ర సాధన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక విప్లవాత్మకమైన పథకాలను తెచ్చి దేశంలోనే తెలంగాణను నంబర్వన్గా నిలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు ప్రపంచ ప్రఖ్యాతిని గాంచాయి. ఐక్య రాజ్య సమితి సైతం మిషన్ భగీరథ, రైతుబంధు పథకాలు అత్యున్నతమైనవని, వీటిని అన్ని దేశాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటే ఆ పథకాల ఔన్నత్యం ఏంటో గుర్తించాలి. కేసీఆర్ లాంటి పాలకులు తెలంగాణను పరిమితం కావద్దు. ఆయన మేధాశక్తి, దార్శనికత జాతీయ స్థాయికి ఎంతైనా అవసరం. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పాల్గొని దేశ పాలనలో భాగస్వామ్యంగా మారితే దేశ స్వరూపమే మారిపోతుంది. అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలల్లో ముందుకు వెళ్తాయనే నమ్మకం ఉంది. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయి.
– పునుగోటి ప్రశాంతి, జడ్పీటీసీ (కొడిమ్యాల)
కొత్త నాయకత్వం అవసరం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది. కొత్త నాయకత్వం దేశానికి చాలా అవసరం. ఎనిమిదేండ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించి దేశానికే దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయనకున్న అనుభవాలు, ఆలోచనలతో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దేశ రాజకీయాల్లోకి వస్తే అంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనడంలో సందేహం లేదు. పేదల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రికి దేశ ప్రజలంతా స్వాగతం పలుకుతారు. ఇప్పటికే దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వంపై ప్రతిపల్లెలో తీవ్రంగా చర్చ జరుగుతున్నది.
– చీటి లక్ష్మణ్రావు, జడ్పీటీసీ (ఎల్లారెడ్డిపేట
బీజేపీతో దేశానికి పట్టిన శని పోతుంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే బీజేపీతో దేశానికి పట్టిన శని పోతుంది. అహర్నిశలూ కష్టపడి రాష్ర్టాన్ని ముందంజలోనే నిలిపిన కేసీఆర్ దేశాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు. జాతీయ స్థాయిలో తప్పనిసరిగా విజయబావుటా ఎగురవేస్తారు. బీజేపీ ఒంటెత్తు పోకడలకు కేసీఆర్ మాత్రమే సరైన సమాధానం. దేశంలో బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలు, నాయకులను ఏకతాటిపైకి తెచ్చే సత్తా కేసీఆర్కే ఉంది. దేశాన్ని పాలించే అనుభవం పుషలంగా ఉంది. ఆంధ్రా పాలకుల కుట్రలను తిప్పికొట్టి రాదనుకున్న తెలంగాణను సాధించి చూపించిన మాదిరిగానే గుజరాతీల పెత్తనం అడ్డుకొని దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగలరనే నమ్మకం ఉంది. బీజేపీ సరారు పాలనలో పూర్తిగా విఫలమైంది. దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని ముంచేసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కచ్చితంగా వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా కచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది. – శ్రీరాం శ్యాం, జడ్పీటీసీ, జమ్మికుంట (హుజూరాబాద్)
దేశం చూపు కేసీఆర్ వైపు
పద్నాలుగేండ్లపాటు ఉద్యమాన్ని చేపట్టి అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. నాటి సమైక్య పాలనలో రాష్ట్రం ఎలా ఉందో.. తెలంగాణ సాధించుకున్నాక ఎంత అభివృద్ధి చెందిందో.. దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ పాలనను స్వయంగా చూస్తున్నారు. ఆయన నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేక రాష్ర్టాల ప్రజలు, రైతులు తమ జిల్లాలను తెలంగాణలో కలుపాలని కోరుతున్నారంటే ఆయన కార్యదక్షతకు నిదర్శనం. కేంద్రంలో బీజేపీ సాగిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే. అంబానీలు, ఆదానీలు వేలకోట్లు సంపాదించుకుని బాగుపడ్డారే తప్ప బడుగు, బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదు. దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించి, పేదల బతుకుల్లో వెలుగులు నింపి మన దేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్ట గల శక్తి ఉన్న మహా నాయకుడు కేసీఆర్.
– సిద్ధం వేణు, జడ్పీ వైస్ చైర్మన్ (రాజన్న సిరిసిల్ల)
కేసీఆర్ దేశ ప్రధాని కావాలి
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని, సెప్టెంబర్ 15 : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడమే కాకుండా దేశానికి ప్రధాని కా వాలని, యువ నాయకులు మంత్రి కేటీఆర్ అత్యున్నత స్థానాన్ని అధిరోహించాలని దుర్గా మల్లేశ్వర స్వామి వారిని, అమ్మవారిని కోరుకొని భవానీ దీక్ష స్వీకరించినట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రీపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి సన్నిధిలో గురువారం ఆయన భవానీ దీక్ష స్వీకరించారు. అనంతరం స్వామిని, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. విజయ దశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 20 ఏళ్లుగా తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకుంటున్నానని, ఐదేళ్లుగా ఇంద్రకీలాద్రిలోని స్వామి సన్నిధిలో మండల దీక్షలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్ర జలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట అమ్మవారి ఉపాసకులు కట్ట సురేశ్ భవానీ, కార్పొరేటర్ బాల రాజ్కుమార్ ఉన్నారు.