కార్పొరేషన్, జనవరి 25: ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం కేసీఆర్ ప్రైవేట్కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నారని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. బల్దియా ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల్లో ‘విద్యార్థి చేయూత’ కార్యక్రమం కింద అల్పాహారం అందించడానికి శ్రీకారం చుట్టారు. కాగా, బుధవారం సుభాష్నగర్లోని ప్రభుత్వ పాఠశాల్లో ప్రత్యేక తరగతులకు హాజరైన పదో తరగతి విద్యార్థులకు మేయర్ సునీల్రావు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బల్దియా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 657 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతుల్లో అల్పాహారం అందిస్తామని తెలిపారు. గత కౌన్సిల్ సమావేశంలో ఈ కార్యక్రమానికి పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
వారంలో ఆరు రోజులు ఆరు రకాల అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మెరుగైన ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. సుభాష్నగర్ పాఠశాలకు ఇప్పటికే రూ. కోటి మేరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. చేయూత కార్యక్రమంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు మర్రి భావన, అర్ష కిరణ్మయి-మల్లేశం, జిల్లా విద్యాధికారి జనార్దన్, బీఆర్ఎస్ నాయకుడు మేచినేని అశోక్రావు, బల్దియా అధికారులు, సిబ్బంది, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిషారానికి కృషి
నగరంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 32వ డివిజన్లో బుధవారం ఆయన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, బల్దియా నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు గిద్దెపెరుమాండ్ల ఆలయం ముందు రోడ్డును గాంధీ విగ్రహం వరకు స్మార్ట్ రోడ్డుగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలోనే పనులను ప్రారంభించి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రుచికరమైన భోజనం అందించాలి
కరీంనగర్లోని వావిలాలపల్లిలో ఏర్పాటు చేసిన మండి అరేబియన్ రెస్టారెంట్ను మేయర్ యాదగిరి సునీల్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు బండారు వేణు, కోటగిరి భూమాగౌడ్, హోటల్ యజమాని మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.