వేములవాడ టౌన్, జనవరి 8: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం సోమవారం భక్తజన సంద్రమైంది. సమ్మక్క-సారలమ్మ జాతరకు ముందే రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.
ఈ క్రమంలో భక్తులు వేకువజాము నుంచే పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించారు. బెల్లాన్ని పంచిపెట్టి, రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకున్నారు. సుమారు 50వేలకు పైగా భక్తులు రాజన్నను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.