వేములవాడ రూరల్, నవంబర్ 1: ‘మీకు సేవ చేయడానికే వచ్చా. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ కోసం పనిచేస్తా. ముంపు గ్రామాల సమస్యల కోసం ముందుండి కొట్లాడి పరిష్కరిస్తా’ అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రజలకు హామీ ఇచ్చారు. వేములవాడ మండలం ఆరెపల్లి, సంకెపల్లి, రుద్రవరంలో బుధవారం ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల చల్మెడ మాట్లాడారు. ముంపు గ్రామాల ప్రజల త్యాగాలు వెలకట్టలేనివని, మిగిలిపోయిన సమస్యలను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని హామీఇచ్చారు. ఇప్పటికే కొందరికి ఇండ్ల పరిహారం మంజూరైందని, కానీ, ఎన్నికల కోడ్ వల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణలో మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నాడని, 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావా లో..? 3గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెసోళ్లు కావాలో..? ఆలోచించి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.\
నిత్యం తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మనకు ఉండడం మన అదృష్టమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించడంతోపాటు సంక్షేమ పథకాలన్నీ మహిళలకే కేటాయించామని తెలిపారు. కాంగ్రెస్కు గ్యారెంటీ లేదని, బీఆర్ఎస్కు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు.
కారు గుర్తుకు ఓటు వేసి వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించడంతో పాటు కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని అభ్యర్థించారు. ఆయాచోట్ల చల్మెడకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏను గు మనోహర్రెడ్డి, జడ్పీటీసీ మ్యాకల రవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊరడి ప్రవీణ్, సర్పంచులు ఇటిక్యాల నవీనరాజు, జింక సునీత, ఊరడి రాంరెడ్డి, ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణస్వామి, సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్రావు, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నరేశ్, బుచ్చయ్య, హరికృష్ణ, నాయకులు బూర బాబు, పరశురాములు, జింక శ్రీధర్, శ్రీనివాస్, భూమేశ్, కనకయ్య, గట్టయ్య, వేణుగోపాల్రావు, భూమయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.