వేములవాడ/ పెద్దపల్లి, సెప్టెంబర్ 29: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ను వేములవాడ, పెద్దపల్లి ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, దాసరి మనోహర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ప్రగతిభవన్లో వేర్వేరుగా కలిసి, తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, చేపట్టాల్సిన పనులపై చర్చించారు.
పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి సానుకులంగా స్పందించారని ఎమ్మెల్యేలు తెలిపారు.