వాషింగ్టన్: ఇరాన్పై 9వ రోజు రాత్రి కూడా అమెరికా అటాక్(US Strikes) చేసింది. సెంట్కామ్ ఆ దాడి గురించి అప్డేట్ చేసింది. అయితే ఎప్పటి మాదిరిగా కాకుండా 9వ రోజు రాత్రి కాస్త ఆలస్యంగా అటాక్ ప్రారంభమైంది. న్యూయార్క్లో ఫిఫా వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్తో పాటు ప్రజెంటేషన్ సెర్మనీ ముగిసిన తర్వాత అమెరికా వైమానిక దళాలు ఇరాన్పై అటాక్ చేసినట్లు తెలుస్తోంది. బాంబు దాడుల అంశంలో అమెరికా అనూహ్యమైన ప్రణాళిక రచించినట్లు స్పష్టమవుతోంది. ఈస్ట్రన్ టైం ప్రకారం రాత్రి 7 గంటలకు దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అయితే గత వారం రోజుల నుంచి మాత్రం 2 పీఎం నుంచి 4 పీఎం వరకు దాడులు జరిగేవి. ఇక సూర్యోదయం కాగానే అమెరికా తన దాడుల్ని నిలిపివేసింది.
కేవలం మూడు గంటలు మాత్రమే నైట్ ఆపరేషన్ జరిగింది. అయితే ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వల్లే ఇరాన్పై దాడి ఆలస్యంగా ప్రారంభమైనట్లు సెంట్కామ్ వెల్లడించలేదు. న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ మ్యాచ్ ఎక్స్ట్రా టైం వరకు వెళ్లింది. మ్యాచ్ తర్వాత టైటిల్ ప్రజెంటేషన్ సమయంలోనూ ట్రంప్ పాల్గొన్నారు. అయితే అమెరికా వరల్డ్కప్ మ్యాచ్, ప్రజెంటేషన్ ముగిసిన తర్వాతే సెంట్రల్ కమాండ్ దాడులు చేసినట్లు తెలుస్తంది. ఇక ఇరాన్ దాడి వల్ల జోర్డాన్, ఇరాక్ స్థావరాల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందారు.
CENTCOM began conducting a new wave of strikes against Iran at 7 p.m. ET today for the ninth consecutive night. The strikes will continue degrading Iranian military capabilities used to attack commercial vessels and civilian mariners transiting the Strait of Hormuz.
— U.S. Central Command (@CENTCOM) July 19, 2026