కరీంనగర్ రూరల్: సెప్టెంబర్ 26: పెత్తందార్లు, నిజాంకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. స్వరాష్ట్రంలోనే దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ వీరులకు సముచిత గౌరవం దక్కిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో మరుగునపడ్డ వారి ఘన చరితను వెలికితీసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మన ప్రభుత్వం పోరాటయోధుల గొప్పతనాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి భావి తరాలకు అందించిందని చెప్పారు.
ఉమ్మడి పాలకులు కులవృత్తులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో వారికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నదని చెప్పారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. పొరపాటున ఢిల్లీ పార్టీలకు రాష్ర్టాన్ని అప్పగిస్తే అరిగోస పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. మన నీళ్లు, మన వనరులను దోచుకెళ్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తిచేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్ రుద్ర భారతి, రాములు, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ మధు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, ఎంపీటీసీలు బుర్ర తిరుపతి గౌడ్. తూల బాలయ్య, సర్పంచులు దబ్బెట రమణారెడ్డి, నందయ్య, సొమిరెడ్డి మునిరెడ్డి, జటంగి కుమార్, చంద్రయ్య, అనిల్, నెక్ పాషా, శ్రీకాంత్, ఎంపీడీవో నీలగిరి దివ్యదర్శన్రావు, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, మదాడి కిరణ్కుమార్, సుద్దాల రాజశేఖర్, రంజక సంఘం అధ్యక్షుడు జటంగి అంజయ్య, జటంగి వినోద్, గంగారాజు, నాగరాజు, మల్లేశ్వరి, శ్రీనివాస్, జటంగి శ్రీనివాస్, శంకరయ్య, రాజు, రాజేశం, వెంటకయ్య, సతీష్, పోన్నం పర్షురాముల, పోన్నాల రాజు, సంతోష్, బుచ్చాల కొమురయ్య, వరి భద్రయ్య, గంగాధర్ హన్మయ్య, పాల్గొన్నారు.