వీణవంక, నవంబర్ 3: సోషల్ మీడియా లో, సామూహికంగా, వ్యక్తిగతంగా అసత్య ప్ర చారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా సీపీ సత్యనారాయణగౌడ్ హెచ్చరించారు. గురువారం వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు ఠాణా ఆవరణలో మొక్కనా టి, నీరు పోశారు. అనంతరం విలేకరులతో మా ట్లాడుతూ ఇటీవల కొంత మంది వ్యక్తులు పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని, విచ్చలవిడిగా గన్లైసెన్స్లు ఇస్తున్నారని అంటున్నారని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రాణహాని ఉన్నదని దరఖాస్తు చేసుకున్న కేవలం ఇద్దరు వ్యక్తులకు( పోల్నేని సత్యనారాయణ, వెంకటేశ్) మాత్రమే గన్లైసెన్స్లు ఇచ్చిన విషయాన్ని గు ర్తు చేశారు. లైసెన్స్డ్ రివాల్వర్స్ ఎవరు దుర్వినియోగం చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయం అడ్డాగా సెటిల్మెంట్లు చేస్తున్నారని కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్ర వాస్తవంలేదని స్పష్టం చేశారు. గ్రామాలలో ముఖ్యంగా గెట్టు పంచాయితీలు తలెత్తుతూ ఉం టాయని, సివిల్ సమస్యలు ఏమిఉన్నా కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు.
సున్నితమైన సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలిగాని గొడవలకు పోవద్దన్నారు. అనుకోని సంఘటనలు, ప్రమాదాలు జరిగినపుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలిగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఆస్తులను ధ్వంసం చేయ డం, ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. మండలంలో ఇసుక రీచ్ల నుంచి ఇసుక రవాణా జరుగుతుందని, మరో కొన్ని కొత్త ఇసుక రీచ్లు కూడా మంజూరైనట్లు చెప్పా రు. ఇసుక అక్రమ రవాణా జరిగితే మైనింగ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, పోలీసులు బాధ్యులని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరి, మక్క కోతల సమయంలో రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబోయకుండా అవగాహన కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. జిల్లాలోని మిగతా మండలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్, విద్యార్థులకు స్టడీ మెటీరియల్, 5కే రన్, హిల్ ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్ఐ శేఖర్రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు. హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి, జమ్మికుంట టౌన్ సీఐ రామచంద్రరావు ఉన్నారు.