Vana Mahotsavam | ఓదెల, ఆగస్టు 25 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ గోలి లింగారెడ్డి ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వివిధ రకాల పూల మొక్కలను నాటారు. అనంతరం గ్రామ ప్రజలకు పూల, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.
సర్పంచ్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు పెంచడం ద్వారా గ్రామాన్ని పచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్వశక్తి మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.