మెట్పల్లి,జనవరి 8: పేగు తెంచుకొని పుట్టిన అన్నదమ్ములు మరణంలోనూ కలిసేపోయారు. తమ్ముడి మృతిని తట్టుకొలేని అన్న బోరున విలపిస్తూ శ్మశానంలోనే కుప్పకూలిపోయాడు. కొన్ని గంటల తేడాలో ఇద్దరు అన్నదమ్ముల మరణంతో తల్లి దండ్రులకు తీరనిదుఃఖం మిగిలింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆదివారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బోగ నాగభూషణం దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు సచిన్ కోరుట్ల పట్టణంలోని ఓ సహకార బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగి. రెండో కొడుకు శ్రీనివాస్(32) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. శనివారం రాత్రి హైదరాబాద్లో శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహా న్ని ఆదివారం ఉదయం మెట్పల్లికి తీసుకువచ్చా రు.
మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించేందు కు వెల్లుల్ల రోడ్డులోని శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. తన తమ్ముడు ఇక రాడు.. రా లేడనే తీవ్ర ఆవేదనకు గురైన సచిన్ బోరున విలపిస్తూ శ్మశానంలోనే కుప్పకూలాడు. బంధుమిత్రు లు ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మ రణించినట్లు నిర్ధారించారు. ఓ వైపు శ్మశానంలో తమ్ముడి చితి కాలుతుండగానే మరో వైపు అన్న మృతి చెందడం పలువురి హృదయాలను కలిచివేసింది. అదే రోజు సాయంత్రం సచిన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సచిన్కు భార్య ఉండగా, శ్రీనివాస్కు భార్య, 15 నెలల కూతురు ఉన్నారు. ఎదిగిన ఇద్దరి కొడుకులు తమ కళ్లేదుటే కానరానిలోకానికి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విలపించిన తీరు స్థానికులను కలిచివేసింది.