మారుతీనగర్, డిసెంబర్ 17: ఆలయాల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందిస్తున్నది. కోరుట్ల నియోజకవర్గంలోని 89 టెంపుళ్లకు సుమారు రూ.10 లక్షల చొప్పున రూ.9.20 కోట్లు మంజూరు చేసింది. టీటీడీ సభ్యుడైన కోరు ట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు చొరవతో నిధులు మంజూరు చేస్తుండగా నియోజకవర్గంలోని ఆలయాలన్నీ అధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. ఆయన కృషికి వేదపండితులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిధులొచ్చిన ఆలయాలివే..
ఇబ్రహీంపట్నం మండలంలో 26 ఆలయాలకు, మల్లాపూర్లోని శ్రీ కనుకసోమేశ్వర ఆలయంతో పాటు 20 టెంపుల్స్, మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ కొండస్వామి ఆలయంతో పాటు 26 ఆలయాలకు, కోరుట్ల పట్టణంలోని చిలకల చిన్న మ్మ, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు, కోరుట్ల మండలంలోని 10 ఆలయాలకు, మెట్పల్లి పట్టణంలోని పదోవార్డులో గల శివాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి నిధులు మంజూరు చేసింది. మొ త్తం నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని 87 పురాతన ఆలయాలకు ఒక్కో ఆలయ అభివృద్ది కోసం రూ.10లక్షల చొ ప్పున విడుదల చేశారు. అలాగే మెట్పల్లి శివారు లోనిఅయ్యప్ప ఆలయం, మల్లాపూర్ మండలం రాఘవపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.25 లక్షల చొప్పున కేటాయించారు. కాగా, తొందరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఆలయాల అభివృద్ధే ధ్యేయం
టీటీడీ సభ్యుడిగా కోరుట్ల నియోజకవ ర్గంలోని దేవాలయాల అభివృద్ధికిటీటీడీ ద్వా రా నిధులను మంజూరు చేయించిన. నియోజకవర్గ ప్రజలు ధర్మ మార్గన్ని ఎంచుకొని శాంతి సుఖజీ వనం సాగించడానికి దేవుడికి సమర్పించిన కానుకలు దేవాలయాల అభివృద్ధికి వెచ్చిస్తున్న.
– కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎమ్మెల్యే
ఎమ్మెల్యే ఆదర్శప్రాయుడు..
అధ్యాత్మిక సేవా కార్యక్ర మాల్లో ఎమ్మెల్యే విద్యాసా గర్రావు ఆదర్శప్రాయుడిగా నిలుస్తారు. ధర్మబద్ధంగా చేసే పనులకు ఆ మణికంఠుడి కరు ణా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనకు, అభివృద్ధికి పరితపి స్తున్న ఆయనకు ధన్యవాదాలు. ఆయన చేస్తున్న కృషితో నియోజకవర్గంలో అధ్యాత్మిక భావం వెల్లివిరుస్తున్నది.
– మంత్రి అంజయ్య, గురుస్వామి (మెట్పల్లి )
ప్రజల గుండెల్లో నిలుస్తారు..
భక్తులు భగవంతుడికి మొ క్కుల రూపంలో చెల్లించిన కానుకలను ఆలయాల అభివృద్దికి, భగవత్ సేవా కార్యక్రమాలకు వినియోగించడం సంతోషకరం. పురాతన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే యత్నం చేస్తున్న ఎమ్మె ల్యే ప్రజల గుండెల్లో నిలుస్తారు. ఆయన చేసిన కార్యాలన్నీ ఫలప్రదమవుతాయి.
– గోరిట్యాల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ భక్తుడు (మెట్పల్లి )