18 గేట్ల ద్వారా దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల
తిమ్మాపూర్: ఎల్ఎండీ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. గులాబ్ తుఫాన్తో ఎగువ
ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లోకి భారీగా ఇన్ప్లో వచ్చి చేరుతున్నది. దీంతో 18 గేట్ల ద్వారా లక్షా66వేల680 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అలాగే ఎల్ఎండీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మోయ తుమ్మెద వాగు నుంచి 89,802, మిడ్ మానేరు నుంచి 15,582 క్యూసెక్కులు, ఇతర క్యాచ్మెంట్ ఏరియా నుంచి 1600 క్యూసెక్కుల నీరు మొత్తం లక్షా6వేల984 క్యూసెక్కుల నీరు ఇన్ప్లో గా రిజర్వాయర్కు వస్తుంది. కాగా 18 గేట్ల ద్వారా దిగువకు 1,66,680 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 309 క్యూసెక్కులు మొత్తం 1,66,989 క్యూసెక్కులు అవుట్ప్లోగా దిగువకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్లో 24.034 టీఎంసీలకు గాను 23.171 టీఎంసీల నీటిమట్టం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాగా కాకతీయ కాలువ ద్వారా దిగువకు విడుదల చేస్తున్న నీటిని అధికారులు నిలిపివేశారు.