సిరిసిల్ల, నవంబర్ 14: ‘గౌరవనీయులైన శంకరవ్వకు.. నేను మీ కల్వకుంట్ల తారకరామారావు’ను అంటూ బీఆర్ఎస్ వర్కింగ్, మంత్రి కేటీఆర్ దస్తూరితో ఉన్న కరపత్రాలు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. గులాబీ రంగుతో మద్రించిన ఈ ఎన్నికల ప్రచార పత్రాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేస్తున్నాయి. బ్రోచర్ మొదటి పేజీలో ‘కారు గుర్తుకు ఓటేద్దాం.. అభివృద్ధిని కొనసాగిద్దాం’ అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలు ఉండగా, వెనుక పేజీలో ఓటరు పేరుతోపాటు ‘నేను మీ కల్వకుంట్ల తారకరామారావు’ అంటూ మంత్రి సందేశాన్ని ముద్రించారు. వీటిని లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి బీఆర్ఎస్ నాయకులు అందిస్తున్నారు. ప్రజలు కూడా తీసుకొని సంబురపడుతున్నారు. తమ పేరుపై వచ్చిన కరపత్రాలను ఆసక్తిగా చదువుతూ, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘రామన్న చెప్పినదంతా నిజమే కదా’ అంటూ మంత్రి కేటీఆర్కు జైకొడుతున్నారు. ‘ఆయనకే మా మద్దతు’ అని చెబుతున్నారు. వీటితో పాటు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో-2023 ప్రచార పత్రాలను అందిస్తుండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలకు పట్టంకడుతామంటూ చర్చిస్తున్నారు.
నిండు మనసుతో ఆశీర్వదిద్దాం
కాంగ్రెస్ పాలనలో చాలీచాలని పింఛన్లతో మీరు పడ్డ కష్టాలు నాకు ఇంకా గుర్తున్నాయి. అందుకే మన తెలంగాణ తెచ్చుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో 200 ఉన్న పింఛన్ ఒకేసారి ఏకంగా పది రేట్లు పెంచి 2,016 అందిస్తున్నారు. ఒకప్పుడు పింఛన్ పైసలతో కనీసం కడుపు నింపుకోలేక, అనారోగ్యం పాలైతే గోలి మందులు కూడా కొనలేక మీరు ఎన్నోసార్లు కంటతడి పెట్టుకున్నారో నాకు తెలుసు. అందుకే మన ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు పెద్దఎత్తున పెంచి అలాంటి దుస్థితి పూర్తిగా రూపుమాపాం. మనకు ఆత్మగౌరవం కల్పించిన, మనసున్న కేసీఆర్ను నిండు మనసుతో ఆశీర్వదిద్దాం.
– మంత్రి కేటీఆర్
పెంచిన పింఛన్లను అందుకుందాం..బీఆర్ఎస్కు అండగా ఉందాం..
ప్రభుత్వం ఆసరా పథకాన్ని సామాజిక బాధ్యతగా భావించింది. అందుకే ఇవాళ ఎంత భారమైనా.. ఒక్కనెల కూడా ఆగకుండా ఠంఛన్గా ప్రతినెలా పింఛన్ ఇస్తున్న ప్రభుత్వంగా దీవెనలు అందుకుంటున్నది. ఆసరా పింఛన్లతో లక్షలాది మంది లబ్ధిదారులు ఎవరిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతుకుతున్నారు. ఎప్పుడూ ప్రజలకు మంచి చేయడంలో ముందుండే మన అధినేత, సీఎం కేసీఆర్ 2,016 పింఛన్ను దశలవారీగా 5,016కి పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి ఎలా అండగా నిలిచారో.. అదే విధంగా ఈ సారి కూడా మన సంక్షేమ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని మనసారా కోరుతున్నాను. నవంబర్ 30న జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మన కారు గుర్తుకు ఓటేద్దాం.. మన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరోసారి గెలిపించుకుందాం.
– ఆసరా పింఛన్ దారులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
రైతుబంధు సాయాన్ని అందుకుందాం.. కారు గుర్తుకే ఓటేద్దాం..
ఇప్పటి వరకు నేరుగా 70లక్షల మంది రైతులకు 72వేల కోట్ల రూపాయలు అందించిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. సీజన్కు ముందే మీ ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు సొమ్ము మీకు కొండంత భరోసాను అందిస్తున్నది. ఇన్ని రోజులు ఏడాదికి 10వేలు అందించిన ప్ర భుత్వం, ఇప్పుడు ఆ పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నది. మొదటి ఏడాది 12వేలకు పెంచి, తర్వాత ప్రతి ఏడాది దశల వారీగా పెంచుతూ మొత్తంగా 16వేలు ఇవ్వనున్నది. కాంగ్రెస్ జమనాలో కల్లోలంగా ఉన్న వ్యవసాయం, తెలంగాణ తెచ్చుకున్నాక.. మన కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేసుకున్నాక పండుగలా మారింది. ఒక్క మాట లో చెప్పాలంటే.. ఇవాళ తెలంగాణ రైతుకు.. కడుపునిండా కరెంట్.. కంటినిండా నిద్ర.. వ్యవసాయరంగంలో నలుదిశలా నవశకం ఇలాగే కొనసాగాలంటే .. మన రైతులోకమంతా ఎల్లవేళలా కేసీఆర్ గారికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. రైతుబాంధవుడుగా కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవడం మన రైతులందరి బాధ్యత.
– రైతుబంధు లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
రైతులందరం అండగా ఉందాం
నాడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అంటే సంక్షోభం. అన్నదాతల ఆత్మహత్యలతో అన్నిదిక్కులా కల్లోలం. పెట్టుబడికి పైసల్లేక అప్పులపాలైన రైతుల కష్టాలు వర్ణనాతీతం. అందుకే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులకు పెట్టుబడి సాయం చేసే విప్లవాత్మక పథకమైన రైతుబంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వ్యవసాయరంగంలో నవశకం ఇలాగే కొనసాగాలంటే మన రైతులోకమంతా ఎల్లవేళలా కేసీఆర్ గారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా.
– మంత్రి కేటీఆర్
లాగోడుకి పైసలు ఇచ్చిన కేసీఆర్నే గెలిపిత్తం
నాకు రైతుబంధు ఇచ్చి బాకీలు చేసుడు తప్పిచ్చిండు కేసీఆర్ సారు. నాకు 60ఏండ్లు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇంతవరకు రైతులకు ఎవలు ఏం చేయలేదు. మా దిక్కు కూడా చూడలేదు. కానీ ఏ గడియలో వచ్చిండో కేసీఆర్ సార్ మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటుండు. నాకు రెండు ఎకరాల పొలం ఉన్న. ఎకరానికి ఐదువేల సొప్పున పదివేలు యాసంగి, వానకాలం పంటలకు రూ.10 వేలు బ్యాంక్లో వేస్తున్నడు. వాటితో నేను లాగో డు పెట్టి వరి సాగు చేత్తున.. కేసీఆర్ సారు రాకముందు లాగోడికి బాకీలు చేసేటొడిని. ఇప్పుడు ఆ బాధ తప్పింది. ఎలాంటి ఆగంలేకుండా పంటలు పండిస్తున్న.. ఆరు నెలల కితం నా కొడుకు పెండ్లి చేసిన. కేసీఆర్ సార్ ఉంటే మాకు రందీ ఉండదు. మళ్లీ రైతుబంధు పెంచుత అంటుండు. మమ్నల్ని ఇంతకంటే ఎక్కువ ఆదుకునే నాయకుడు ఎవలుండరు. మా సారు మాగ్గావాలె. మాకు సీఎం కేసీఆర్ సారు ఇంటి పెద్దలెక్క అన్ని చూసుకుంటుండు. కారు గుర్తుకు ఓటేసి మళ్లీ కేసీఆర్ సారును ముఖ్యమంత్రి చెత్తాం. మా రైతులందరం ఇట్లే అనుకుంటున్నం.
– ఇరిగి ఎల్లయ్య, బరిగెలగూడెం (గంభీరావుపేట)