కొత్త రకం వైరస్ హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా కేసులు ఇప్పటి వరకు జిల్లాలో లేవు. కొత్త వైరస్ కేసులు నమోదవుతున్నాయన్నది అబద్ధం. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. కేవలం ఫ్లూ వైరస్ కారణంగా జ్వరాలు వస్తున్నాయి.
దవాఖానలో జాయిన్ అయిన కేసుల్లో ఫ్లూ లక్షణాలు మాత్రమే ఉన్నాయి. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, జలుబు, దగ్గు ఉన్న వారు మాసు తప్పనిసరిగా ధరించాలి. అలా చేయడం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు.
– కరీంనగర్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల