Karimnagar | కార్పొరేషన్, మార్చి 16 : కరీంనగర్ నగర ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యవంతులుగా ఉంటారని నగర కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. స్థానిక 52వ డివిజన్లో పారిశుద్ధ పనులను సోమవారం పరిశీలించి ప్రజా పాలన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్య పనుల విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సరిల్లా రాజకుమారి, ప్రసాద్, మాజీ కార్పొరేటర్ అశోక్ రావు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.