ఎలిగేడు, డిసెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ రోడ్ల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం లలితపల్లి, చీమలపేట, తెలుకుంట, పెద్దాపూర్ దాకా రూ. కోటీ 38 లక్షలతో నిర్మించే తారురోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రస్తుతం చేపడుతున్న రోడ్డును త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
సుల్తాన్పూర్ నుంచి ఎలిగేడు దాకా కూడా డబుల్ రోడ్డు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఇక్కడ జడ్పీటీసీ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఎంపీవో అనిల్రెడ్డి, విండో చైర్మన్ గోపు విజయభాస్కర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాడ కొండల్రెడ్డి, సర్పంచులు బూర్ల సింధూజ, పెద్దోల్ల అయిలయ్య, దేవరనేని ప్రభావతి, గొల్లె కావేరి, ఆర్కే రాజా, తంగెళ్ల స్వప్న, గోపు విజేందర్రెడ్డి, నాయకులు ధూళికట్ట విండో మాజీ అధ్యక్షుడు కొక్కిరాల మహేశ్వరరావు, తానిపర్తి మోహన్రావు, వొద్ది ప్రసాదరావు, బూర్ల వెంకటసత్యం, మండిగ రాజనర్సయ్య, బద్దం తిరుపతిరెడ్డి, కల్లెం శ్రీనివాసరెడ్డి పలు గ్రామాల నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.