కరీంనగర్ తెలంగాణచౌక్, జనవరి 11 : రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు డిపో -2 ఆవరణలో వేలం పాట నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం బస్సులో మరిచిపోయిన వస్తువుల కోసం సరైన ఆధారాలతో ఎవరూ రాకుంటే 24 గంటల తర్వాత లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద వేలం వేస్తారని కరీంనగర్ డిపో-2 మేనేజర్ మల్లయ్య తెలిపారు.
ఇప్పటి వరకు పందెం కోడి కోసం ఎవరూ రాలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం వేస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారు పాల్గొనాలని, నగదును ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తామని చెప్పారు.