గంగాధర, ఫిబ్రవరి 5: మహిళ మెడలోంచి పుస్తెలతాడును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలో జరిగింది. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన ఇట్టె లక్ష్మి ఆదివారం గంగాధర మండలం గర్శ కుర్తిలోని తన కూతురు ఇంటికి వెళ్లడానికి జేఎన్టీయూ ఎక్స్ రోడ్ వద్ద ఆటో ఎకింది. ఆటో డ్రైవర్తో పాటు మరో మహిళ కూడా ఆటోలో ఉన్నది. ఈ క్రమంలో గంగాధరలో ఓ వ్యక్తి వద్ద డబ్బులు వచ్చేది ఉందని, వాటిని తీసుకొని వెళ్దామని.. అతడు ఎకడ ఉన్నాడో తెలుసు కోమని ఆటో డ్రైవర్ ఆటోలో కూర్చున్న మరో మహిళతో అన్నాడు.
సదరు మహిళ మధురానగర్ సమీపంలోని మామిడి తోటలో ఉన్నట్లు తెలిపింది. సదరు వ్యక్తి దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుని వెళ్దామని ఆటో డ్రైవర్ లక్ష్మికి చెప్పాడు. ఆటోను మామిడితోటలోకి తీసుకువెళ్లి నిలిపివేశారు. ఆటో డ్రైవర్ ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొని పరారయ్యారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అభిలాష్ తెలిపారు.