వేములవాడ టౌన్, నవంబర్ 27 : కరోనా మహమ్మారితో 2020 ఫిబ్రవరి 19న మూసివేసిన రాజన్న ఆలయ ధర్మగుండం డిసెంబర్ 4 న భక్తుల పుణ్యస్నానాలతో పులకరించబోతున్నది. వివిధ ప్రాంతాలనుంచి రాజన్న దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు పవిత్ర ధర్మగుండంలో స్నానమాచరించి రాజన్నను దర్శించుకోవడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. కరో నా దృష్ట్యా ఆలయ అధికారులు దాదాపు 34 నెలలపాటు ధర్మగుండాన్ని మూసివేయడంతో భక్తులు నిరాశకులోనయ్యారు.
భక్తుల కోరిక, దేవాదాయశాఖ అనుమతుల మేరకు ఎట్టకేల కు ఆలయ ధర్మగుండం డిసెంబర్ 4 నుంచి పూ ర్వవైభవాన్ని సంతరించుకోనుంది. ఇందుకు గాను ఆదివారం ఉదయం నుంచి ఆలయ ధర్మగుండంలో పూడికతీత పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఆదివారం 50 మంది బయటి వ్యక్తులతో, 25 మంది దేవాలయ సి బ్బందితో పూడికతీత పనులు కొనసాగుతున్నాయని శానిటరీ ఇన్స్పెక్టర్ వరి నర్సయ్య తెలిపా రు. ఇంజినీరింగ్ అధికారుల సూచనల మేరకు మరో మూడురోజులపాటు పూడికతీత పనులు కొనసాగుతాయని, అనంతరం మంచినీటితో ధర్మగుండాన్ని నింపుతామని వెల్లడించారు.