వేములవాడ, అక్టోబర్ 31: సీఎం కేసీఆర్ పాలనలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 4,016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశా రు. వేములవాడ పట్టణంలోని రాజశ్రీ ఫంక్షన్హాల్లో మంగళవారం నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో 500 మాత్రమే ఉన్న పింఛన్ను, సీఎం కేసీఆర్ దశలవారీగా పెంచి ప్రస్తుతం 4,016 అందిస్తున్నారని కొనియాడారు. గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లల్లో దివ్యాంగుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 10,300కోట్లు కేటాయించిందని తెలిపారు. సబ్బండవర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
గతంలో వాహనాలకు 30 శాతం మాత్రమే సబ్సిడీ ఉండేదని, ప్రస్తుతం వందశాతం అందిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో 200 పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు, నిరంతర కరెంట్ అవసరమా..? కరెంట్ వద్దన్న కాంగ్రెస్ కావాలా..? అని ఆలోచించాలని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడలక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మార్ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య యాదవ్, ఎంపీపీలు బండ మల్లేశం, బైరగోని లావణ్య, చంద్రయ్యగౌడ్, జడ్పీటీసీ మ్యాకల రవి, సెస్ డైరెక్టర్లు హరిచరణ్రావు, ఆకుల దేవరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ బాల్రెడ్డి, పార్టీ అధ్యక్షులు పులం రాజు, గోసుల రవి, మల్యాల దేవయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు రాంరెడ్డి, ఏశ తిరుపతి, కమలాకర్రావు, కౌన్సిలర్లు, సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు రాఘవరెడ్డి, గడ్డం హన్మాండ్లు, రామతీర్థపు రాజు, తదితరులు పాల్గొన్నారు.
రుణం తీర్చుకుంటం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో ఉన్నరు. గతంలో 500 వచ్చే పింఛన్ కోసం నానాతంటాలు పడేటోళ్లం. ఈ రోజు 4,016 ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నడు. కారు గుర్తుకు ఓటేస్తాం. కేసీఆర్ సారు రుణం తీర్చుకుంటం.
– మరాటి తిరుపతి, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
అభివృద్ధిని చూసి కేంద్రమే ప్రశంసించింది
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత అభివృద్ధి తెలంగాణలో అద్భుతంగా జరుగుతున్నది. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ పలు సందర్భాల్లో ప్రశంసించి, అవార్డులు అందించింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నీతిఅయోగ్ గుర్తించి రివార్డులు కూడా ఇచ్చింది. రాజకీయ విమర్శలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రులు ఆరోపణలు చేస్తున్నరు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నరు. రాష్ట్రంలో ఐదు లక్షల 69వేల712 మందికి పింఛన్ ఇవ్వడమే కేసీఆర్ పాలనకు నిదర్శనం. దివ్యాంగులకు 4,016 పింఛన్ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో దశల వారీగా 6,016 అందిస్తాం. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేసే మోసపూరిత హామీలు నమ్మవద్దు.
– వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
ఆశీర్వదించండి.. రుణపడి ఉంటా
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రజలపై చిత్తశుద్ధి లేదు. బీజపీ పాలిత రాష్ర్టాలైన మహారాష్ట్రలో 300, ఉత్తరప్రదేశ్లో 400మాత్రమే దివ్యాంగులకు పింఛన్గా ఇస్తున్నరు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాత్రమే 4,016 ఇచ్చి దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నరు. అలాగే డబుల్బెడ్రూం ఇండ్లలో ఐదుశాతం రిజర్వేషన్ కల్పిస్తున్నర్రు. పూర్తి సబ్సిడీపై వాహనాలు ఇస్తున్నాం. నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి. మీకు రుణపడి ఉంటా. అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తా.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్ఎస్ అభ్యర్థి