బడికో, దుకాణానికో, ట్యూషన్కో, మార్కెట్కో వెళ్లినప్పుడు మిమ్నల్ని ఎవరైనా వెంబడిస్తున్నారా..? అశ్లీల మాటలతో వేధింపులకు గురిచేస్తున్నారా..? అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా..? అయితే, మీరు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన పనిలేదు.. మీ సెల్ఫోన్లోని పోక్సో ఈ బాక్స్ యాప్పై క్లిక్ చేస్తే చాలు.. మీ కంప్లైంట్ ఆన్లైన్లో పోలీసులకు చేరుతుంది. తద్వారా నిందితులకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంటుంది.
కలెక్టరేట్, ఏప్రిల్ 8 : తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. షీటీంలను ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలతో నిఘా పెంచింది. ఈ దిశగా మరో అడుగు మందుకువేసింది. అధునాతన టెక్నాలజీతో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి పోక్సో ఈ బాక్స్ యా ప్ను అందుబాటులోకి తెచ్చింది.
ఆకతాయిల ఆగడాలకు సర్కారు చెక్
మహిళలు, బాలికలు, విద్యార్థినులు నిత్యం ఆకతాయిల వేధింపుల బారినపడుతున్నారు. అయితే నేరుగా ఫిర్యా దు చేసేందుకు పోలీస్స్టేషన్లకు వెళ్లలేక లోలోన కుమిలిపోతున్నారు. బయట వాళ్లకు తెలిస్తే పరువు పోతుందని భయపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆగడాలకు సర్కారు చెక్ పెట్టాలని నిర్ణయించింది. బాలికల రక్షణ, నేరస్తులను శిక్షించేందుకు బాధితుల వివరాలు గోప్యంగా ఉండేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తా ధ్వర్యంలో పోక్సో ఈ బాక్స్ యాప్ను రూపొందించారు.
దీనిని కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి తెచ్చారు. బాధితుల నుంచి ప్రతి నెలా కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఆరు నెల లుగా ఇరవైకి పైగా యాప్లో ఫిర్యాదు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వచ్చిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి, విచారణ జరిపి, నిందితులపై కేసులు నమో దు చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ యాప్పై అధికార యంత్రాంగం పెద్దగా ప్రచారం చేయకపోవడంతో ఇంకా అనేక మంది బాధితులు ఫిర్యాదులు చేయకుండా మిన్నకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బాలల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పలుచోట్ల, పాఠశాలల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ఫోక్సో ఈ బాక్స్ యాప్పై చిన్నారులు, విద్యార్థులకు, మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో, తమను వేధించే వారిపట్ల ఫిర్యాదుల పరంపర క్రమక్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ యాప్ ద్వారా ఎవరైనా ఆనె్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశముంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధింత అధికారులు బా లల సంరక్షణ, స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం, పోలీస్ శా ఖకు సమాచారం అందజేస్తారు. ఫిర్యాదుపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. అనంతరం వేధించిన వారిని పోలీసుల సహకారంతో పట్టుకొని కేసు నమోదు చేస్తారు. నేరస్తులు తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో వారిని కఠినంగా శిక్షిస్తారు.
ఫిర్యాదు ఇలా..
బాధితులు ముందుగా జాతీయ బాలల హకుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) అధికారిక పోర్టల్ ఎంపిక చే సుకోవాలి. ఫిర్యాదును నమోదుకు పోర్టల్ హోం పేజీలో పోక్సో ఈ బాక్స్ బటన్ క్లిక్ చేసిన వెంటనే వృతాకారంలో ఫోక్సో ఈ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. అందులో చిన్నారు లు, బాలికలకు ఎదురయ్యే పలు రకాల వేధింపుల చిత్రా లు కనిపిస్తాయి. బస్సులో పాఠశాలకు, దుకాణానికి వెళ్లే సమయంలో, మైదానంలో ఆడుకునే సందర్భంలో, ట్యూషన్కు వెళ్తున్న క్రమంలో గానీ, బహిరంగ ప్రదేశా లు, రోడ్లపై, ఫోన్, ఇంటర్నెట్, వాట్సప్ జరిగే వేధింపుల చిత్రాలు ఉంటాయి.
అలాగే బాలికల శరీర భాగాల చిత్రీకరణ, అనుచిత వ్యాఖ్యలు, దుష్ప్రవర్తన లాంటి చిత్రా లు కూడా ఉంటాయి. ఇందులో ఏవిధమైన వేధింపులకు పాల్పడుతున్నారో గుర్తించి పోర్టల్లోని చిత్రంపై క్లిక్ చే యాలి. బాధితుల ఈమెయిల్, ఫోన్ నెంబర్ వివరాలతో కూడిన ఫాం పూరించి సబ్మిట్ బటన్పై నొక్కాలి. వెంటనే ఫిర్యాదు అప్లోడ్ అవుతుంది. బాధితుల వివరాలను ఈ యాప్ పూర్తి గోప్యంగా ఉంచుతుంది.
ఈ పోర్టల్తో మహిళలకు భరోసా
మహిళలు, బాలికలపై వేధింపులను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో ఈ బాక్స్ పోర్టల్ రూ పొందించాయి. బాధితులు భయపడకుండా ఆనె్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఈ – బాక్స్ ఫిర్యాదులపై అవగాహన కల్పిస్తున్నాం. ఫిర్యాదులను వ్యక్తిగతంగా లేదా పోస్ట్ మెసెంజర్, ఇతర మార్గాల ద్వారా ఎన్సీపీసీఆర్ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు. తల్లి దండ్రులు, పిల్లల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, సమస్య పరిషరిస్తాం.
– శాంత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి