మానకొండూర్, ఫిబ్రవరి 6: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర పేరుతో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను సహించేది లేదని, ఆమె తీరు మార్చుకోక పోతే బీఆర్ఎస్ పక్షాన తగిన బుద్ధి చెబుతామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ షర్మిలకు తెలంగాణ ఉద్యమ నేపధ్యం గురించి ఏమీ తెలియదనానరు.
నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అడ్డుకున్న సంగతి మర్చిపోయావా అని ప్రశ్నించారు. రక్త చరిత్ర కలిగిన కుటుంబ నేపథ్యం, రక్త చరిత్ర గల జిల్లా నుంచి వచ్చిన తనకు తెలంగాణ ఉద్యమ నేపధ్యం గురించి ఏమి తెలుసని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణాలు తెగించి పోరాడిన ఉద్యమనేత , ముఖ్యమంత్రి కేసీఅర్, తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నేతలపై హద్దుమీరి విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పాదయాత్రలలో తాను చేస్తున్న వ్యాఖ్యలకు తెలంగాణ వాదుల ఆత్మాభిమానాలు దెబ్బతింటే దాడులు చేసే రోజులు వస్తాయన్నారు.
ముందస్తుగా బీఆర్ఎస్ పక్షాన ఫస్ట్ ఎయిడ్ కిట్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నామని, దీనిని తన దగ్గర ఉంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటి వరకు ఒక మహిళ అపూ గౌరవం ఇచ్చామని, పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాల్లపెల్లి శేఖర్గౌడ్, ఎంపీటీసీ సభ్యులు పిట్టల కవిత, ఉండింటి సులోచన, బీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్రెడ్డి, నాయకులు శాతరాజు యాదగిరి, పిట్టల మధు, దండబోయిన శేఖర్, ఎండీ వలీపాషా, ఇస్కుల్ల ఆంజనేయులు, నెల్లి శంకర్, పిండి సందీప్, బొల్లం అనిల్ తదితరులు పాల్గొన్నారు.