కమాన్చౌరస్తా, మే 23 : శాతవాహన విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉపకులపతిగా కే సురేంద్రమోహన్ ఐఏఎస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వరప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రసాద్, ఫైనాన్స్ ఆఫీసర్ రవీందర్, తదితరులు సురేంద్ర మోహన్ను హైదరాబాద్లోని సచివాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ప్రస్తుతం రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి కా ర్యదర్శిగా ఉన్న ఆయన అక్కడే బాధ్యత లు స్వీకరించి, విశ్వవిద్యాలయ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తాన ని తెలిపారు. ప్రధానంగా విద్యార్థుల చదువు తర్వాత ఉద్యోగావకాశాలు కల్పిం చే దిశగా ముందుకు సాగాలని, ప్రస్తుత, పూర్వ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలని ఆకాంక్షించినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.