ధర్మారం, డిసెంబర్ 12 : క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గురుకుల విద్యాలయాల విద్యార్థులు ఒలింపిక్స్లో ఆడే స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల సొసైటీ సంయుక్త కార్యదర్శి శారద పిలుపునిచ్చారు. ధర్మారం మండలం నంది మేడారంలోని బాలికల గురుకుల విద్యాలయంలో ఈ నెల 9 నుంచి రాష్ట్రస్థాయి గురుకుల క్రీడాపోటీలు నిర్వహించగా, మంగళవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. ఇక్కడ ఎన్నికైన క్రీడాకారులను ఇంటర్ సొసైటీ లీగ్ (ఐఎస్ఎల్)కు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
విజేతలు వీరే..
అండర్-14, 17, 19 విభాగాల్లో జరిగిన క్రీడాపోటీలు హోరాహోరీగా జరిగాయి. కబడ్డీ అండర్ -14 విభాగంలో పాలకుర్తి జట్టు మన్ననూరు జట్టుపై విజయం సాధించింది. టెన్నీకాయిట్లో ధర్మారం జట్టుకు చెందిన ఆర్. ఉష, ఎస్ మృదుల విజేతలుగా నిలవగా మణికొండకు చెందిన జీ నవ్య, కే అంజలి రన్నర్గా నిలిచారు. చెస్లో తొర్రూరుకు చెందిన బీ శ్రీలాస్య విన్నర్గా నిలువగా, హుజూరాబాద్కు చెందిన ఎస్ ఐశ్వర్య రన్నర్గా నిలిచింది. వాలీబాల్ అండర్ -17 విభాగంలో భద్రాచలం జట్టు విన్నర్గా నిలవగా, పరకాల రన్నర్గా నిలిచింది. కబడ్డీలో ముల్కాలపల్లి జట్టు విన్నర్గా, ఎక్లరా జట్టు రన్నర్గా నిలిచాయి. టెన్నీకాయిట్లో నడిగూడెం జట్టులో ఎం కావేరి, ఎం కీర్తన విన్నర్గా నిలవగా, మల్కాజిగిరి జట్టులో ఎస్ నిఖిత, ఎం లలిత రన్నర్గా నిలిచారు. చెస్లో కొల్లాపూర్ విద్యాలయం విద్యార్థిని ఎస్ వైష్ణవి విన్నర్గా, ఆర్మూర్ విద్యార్థిని ఈ వనజ రన్నర్గా నిలిచారు. హ్యాండ్బాల్ పోటీల్లో మహేంద్రహిల్స్ జట్టు విన్నర్గా, రాయపర్తి జట్టు రన్నర్గా నిలిచాయి. బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో ధర్మారం జట్టు విన్నర్గా, మధిర రన్నర్గా నిలిచాయి.
వాలీబాల్ అండర్ -19 విభాగంలో పాలకుర్తి జట్టు విన్నర్గా, బొర్లాం జట్టు రన్నర్గా నిలిచాయి. కబడ్డీలో నకిరేకల్ జట్టు విన్నర్గా, తాడ్కోల్ జట్టు రన్నర్గా నిలిచాయి. టెన్నీకాయిట్లో మడికొండకు చెందిన బీ పూజ, ఎన్ బిందు విన్నర్లుగా నిలవగా, నంచర్లకు చెందిన బీ లావణ్య, జీ సరిత రన్నర్లుగా నిలిచారు. చెస్లో కొత్తకోటకు చెందిన జే లక్ష్మీ విన్నర్గా, అడవిమల్లెకు చెందిన పీ సుధారాణి రన్నర్గా నిలిచింది. హ్యాండ్బాల్లో రాయపర్తి జట్టు విన్నర్గా నిలవగా, జాఫర్గడ్ జట్టు రన్నర్గా నిలిచాయి. బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో మధిర జట్టు విన్నర్గా నిలవగా, ధర్మసాగర్ జట్టు రన్నర్గా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి నంది మేడారం గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శైలజ అధ్యక్షత వహించగా, ఆర్డీఓ మధుమోహన్, గురుకులాల నోడల్ అధికారి శేషి కుమారి, కరీంనగర్ ఆర్సీవో శ్రీనివాస్ రెడ్డి, డీసీలు జాక్విలిన్, వెంకటేశ్వర్రావు, మంజుల, కరీంనగర్ రీజియన్ ప్రిన్సిపాల్, కరీంనగర్ బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దేవి శ్రీధర్, తాసిల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో భీమ జయశీల, ఎస్ఐలు తనుగుల సత్యనారాయణ, అశ్విని, నందిమేడారం పీహెచ్పీ డాక్టర్లు సుస్మిత, గౌతమ్, క్రీడ ఆర్గనైజర్లు నీరజ, సుష్మ, పీడీ సరిత, పీఈటీ నర్మద పాల్గొన్నారు.