ధర్మపురి పట్టణంలోని లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బ్రహ్మపుష్కరిణి(కోనేరు)లోయోగా నృసింహస్వామి తెప్సోత్సవం, డోలోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. మొదట ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించిన సేవపై మేళతాళాల మధ్య కోనేరు వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.
కోనేరులో అప్పటికే అలంకరించిన హంస వాహనంపై ఆసీనులను చేసి కోనేరులో చుట్టూ భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఐదు ప్రదక్షిణలు చేశారు. అనంతరం కోనేరు మధ్యలో గల మండపంలోని ఊయలలో స్వామివార్లను ఉంచి పండితులు మంత్రోచ్ఛారణల మధ్య డోలోత్సవం నిర్వహించారు.
– ధర్మపురి, మార్చి 24