వేములవాడ టౌన్, జూన్ 21 : వేములవాడ రాజన్న క్షేత్రా న్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వేములవాడ ఎమ్మె ల్యే చెన్నమనేని రమేశ్బాబు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా రాజన్న ఆలయంలో బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఓపెన్స్లాబ్పై ధూపదీప నైవేద్యం కింద 18 మంది అర్చకులకు నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలయాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో 56 ఆలయాలు ధూపదీప నై వేద్యం కింద నిర్వహిస్తున్నారని, అందులో 18 ఆలయాలకు సంబంధించిన అర్చకులకు నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉన్నదన్నారు. మంజూరు చేసిన సీఎం కేసీఆర్, దే వాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తె లిపారు. అర్చకుల వేతనాలను రూ.6 వేల నుంచి రూ.10 వేల కు పెంచడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.
సంప్రదాయ పండుగలకు రూ.75 కోట్లు, బోనాలకు రూ.78 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ఎస్సారార్ జలాశయం నుంచి రూ.16 కోట్లతో నీటిని గుడిచెరువుకు లిఫ్ట్ వేసుకున్నామని, రూ.125 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మించామన్నారు. పట్టణంలో అన్ని హంగులతో దవాఖాన నిర్మించుకున్నామని చెప్పారు. గుడి చెరువు పక్కన 30 ఎకరాలు సేకరించి ఆలయానికి అప్పగించామని, బద్దిపోచమ్మ ఆలయానికి రూ.18 కోట్లతో ఎకరం సేకరించామని తెలిపారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ బోనాల మండప నిర్మాణం, శివార్చన వేదిక స్థలంలో శాశ్వత ప్రదర్శన వేదికకు భూమిపూజ చేయనున్నారని పేర్కొన్నారు.
ఇందుకు దాదాపు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఇటు టెంపుల్, అటు పట్టణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వెల్లడించారు. కానీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణప్రసాద్, జగిత్యాల జడ్పీ వైస్చైర్మన్ వొద్దినేని హరిచరణ్రావు, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, జడ్పీటీసీ మ్యాకల రవి, మేడిపల్లి ఎంపీపీ చంద్రయ్యగౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు పుల్కం రాజు, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, ఇప్పపూల అజ య్, బింగి మహేశ్ , జోగిని శంకర్, మారం కుమార్, సిరిగిరి చందు, పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, గూడూరి మధు, రామతీర్థపు రాజు, సలీం, ఆలయ ఈఈ రాజేశ్ ,ఈవో సీసీ ఎడ్ల శివ తదితరులు పాల్గొన్నారు.