జగిత్యాల, డిసెంబర్ 7: అసెంబ్లీ ఎన్నికలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు,
సిబ్బందికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ఎలాంటి సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ప్రభాకర్ రావు, భీమ్రావు పాల్గొన్నారు.