శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
సినారె కళామందిరంలో పోలీసు శిక్షణ శిబిరం ముగింపు
హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ
అభ్యర్థులతో కలిసి భోజనం
సిరిసిల్ల రూరల్, జూలై 4: పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత పట్టుబట్టి కొలువులు కొట్టాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే పిలుపునిచ్చారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించారు. జిల్లాకేంద్రంలోని సినారె కళామందిరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 63 రోజులుగా పోలీస్ ఉద్యోగార్థులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఎస్పీ రాహుల్హెగ్డే సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో కలిసి హాజరయ్యారు. అభ్యర్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న యువకులు ఉద్యోగాలు సాధించినప్పుడే తమకు లభించిన బహుమతిగా భావిస్తామన్నారు. ఆత్మవిశ్వాసంతో ప్రిపేరయి జాబ్ సాధించి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు.
ఉద్యోగార్థులకు కొంతకాలం పాటు సెల్ఫోన్కు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. నిపుణుల సూచనలు పాటిస్తూ ఎగ్జామ్స్కు సిద్ధం కావాలని కోరారు. శిక్షణ సందర్భంగా ఇచ్చిన మెటీరియల్తో పాటు నాణ్యమైన బుక్స్ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల కోరిక మేరకు ప్రతి వారం ఒకరోజు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ మాట్లాడుతూ నిరుద్యోగులకు అండగా ఉండేందుకే రూ. 15లక్షలు వెచ్చించి భోజన వసతి కల్పించామని చెప్పారు. అభ్యర్థులు శ్రద్ధతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.
శిక్షణ శిబిరంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాగం, ఫ్యాకల్టీ ఇన్చార్జి చారి, బోధకులు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ- చక్రపాణి సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రశేఖర్, నాగేంద్రాచారి, తహసీల్దార్ విజయ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, సీఐలు అనిల్కుమార్, ఉపేందర్, మొగిలి, వెంకటేశ్, బన్సిలాల్, సర్వర్, నవీన్కుమార్, ఆర్ఐలు రజనీకాంత్, యాదగిరి, కౌన్సిలర్ భూక్య రెడ్యనాయక్, ఎస్ఐలు ఉన్నారు.